బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.ప్రభుత్వాలను కూలుస్తామంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు ఏమైనా బండి సంజయ్ కు చెప్పారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందన్న ఆయన ప్రజలు మార్పు కోరుకునే కాంగ్రెస్ ను గెలిపించారని పేర్కొన్నారు.
బీజేపీతో తాము ఎలాంటి పొత్తు పెట్టుకోమన్నారు.ఆ అవసరం కూడా తమకు లేదని తేల్చి చెప్పారు.
అలాగే కరీంనగర్ కు బండి సంజయ్ చేసిందేమీ లేదని ఆరోపించారు.