తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ భూమికా చావ్లా( Bhumika Chawla ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.భూమికా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఖుషి.
( Khusi Movie ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది భూమిక.మరి ముఖ్యంగా ఈ సినిమాలో నడుము సీన్ హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు.
అయితే ఒకప్పుడు పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమికా ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఈమె ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలని ఎక్కువగా ఎంచుకుంటూ దూసుకుపోతోంది భూమికా.ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ భూమికా చావ్లా నయా బిజినెస్ ( Business ) స్టార్ట్ చేసింది.ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్గా పేరున్న గోవాలో( Goa ) కొత్త హోటల్ను ప్రారంభించింది భూమిక.అనంతరం ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.
గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్( Samara Wellness Hotel ) అంటూ భూమిక ఇన్స్టాలో రాసుకొచ్చింది.ఇక పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్లు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ భూమికకు అభినందనలు తెలుపుతున్నారు.
కాగా మొదట యువకుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది భూమిక.పవన్ కల్యాణ్ ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది.ఒక్కడు, సింహాద్రి, మిస్సమ్మ, వాసు తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్లోనూ స్పెషల్ రోల్స్తో సందడి చేస్తోందీ అందాల తార.నాని ఎంసీఏలో మెరిసిన ఈ సీనియర్ భామ ఇటీవల కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో మెరిసింది.ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.