జాతీయ స్థాయిలోని ప్రధాన రాజకీయ కూటములు ‘ఎన్డీఏ’,( NDA ) ‘ఇండియా’లు( INDIA ) మరోసారి ఒకే రోజు పోటా పోటీ భేటీలను పోటాపోటీగా నిర్వహిస్తున్నవేళ రాజకీయం మంచి రసవత్తరంగా కొనసాగనుంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అవును, మీరు విన్నది నిజం.
అధికార కూటమి ‘ఎన్డీఏ’, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లు ఒకే రోజు, ఒకే నగరంలో కీలక సమావేశాలను నిర్వహిస్తుండం కొసమెరుపు.విషయం ఏమంటే సెప్టెంబర్ 1న, ముంబైలో( Mumbai ) అధికార కూటమి ‘ఎన్డీఏ’, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ లు పోటా పోటీ భేటీలను నిర్వహించనున్నాయి.
ఈ వార్తే ఇపుడు జాతీయంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
![Telugu Congress, India, India Nda, Mumbai, Narendra Modi, Nda, Nitish Kumar, Rah Telugu Congress, India, India Nda, Mumbai, Narendra Modi, Nda, Nitish Kumar, Rah](https://telugustop.com/wp-content/uploads/2023/08/INDIA-vs-NDA-as-both-alliances-hold-parallel-meetings-on-Sep-1-in-Mumbai-detailsd.jpg)
ఇక విపక్ష కూటమి ఇండియాకు ఇది మూడో జాతీయ స్థాయి సమావేశం కానుండడంతో కాంగ్రెస్( Congress ) దేశ వ్యాప్తంగా ఉన్న 26 ఎన్డీయేతర రాజకీయ పార్టీలు గత సమావేశంలో పాలు పంచుకోనున్నాయి.కాగా ఈ సమావేశమైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.ఈ సంవత్సరం మరో రెండు లేదా మూడు పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశమున్నట్లు కూడా భోగట్టా.
ఈ మేరకు ‘ఇండియా’ కీలక నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్( Nitish Kumar ) సంకేతాలివ్వడం జరిగింది.
![Telugu Congress, India, India Nda, Mumbai, Narendra Modi, Nda, Nitish Kumar, Rah Telugu Congress, India, India Nda, Mumbai, Narendra Modi, Nda, Nitish Kumar, Rah](https://telugustop.com/wp-content/uploads/2023/08/INDIA-vs-NDA-as-both-alliances-hold-parallel-meetings-on-Sep-1-in-Mumbai-detailss.jpg)
ముంబైలో ‘ఎన్డీఏ’ భేటీ జరగనుండడం వలన మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ,( BJP ) శివసేన (షిండే వర్గం),( Shivsena ) ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)( NCP ) ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.విపక్ష ఇండియా కూటమి సమావేశానికి పోటీగానే ఎన్డీయే సమావేశాన్ని ముంబైలో అదేరోజు నిర్వహించాలనుకోవడంపై స్పందిస్తూ.సెప్టెంబర్ 1వ తేదీన ఎన్డీయే సమావేశాన్ని ముంబైలో నిర్వహిాంచాలన్న నిర్ణయం చాలా రోజుల క్రితమే తీసుకున్నారని వివరించడం జరిగింది.
కాగా రెండు కూటములు ఒకే రోజు, ఒకే నగరంలో సమావేశాలు నిర్వహించడం కాకతాళీయమేనని చెప్పుకొచ్చారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కాంగ్రెస్ అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు.