గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ధనుష్ కోలీవుడ్( kollywood ) లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న ధనుష్ ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
ధనుష్( Dhanush ) ముందు నుండి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు.ఇక ఈ మధ్యనే సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
మరి ధనుష్ సార్ ( Captain Miller )వంటి సినిమాతో హిట్ అందుకున్న తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంచి స్వింగ్ లో ఉన్నారు.ప్రస్తుతం ధనుష్ ‘క్యాప్టెన్ మిల్లర్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఎవైటెడ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ధనుష్ హీరోగా ప్రియాంక మోహన్</em( Priyanka Mohan ) హీరోయిన్ గా డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'క్యాప్టెన్ మిల్లర్'పై తమిళ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుండగా నిన్న అలీ 28న ధనుష్ పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు.దీంతో ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇది తాజాగా రిలీజ్ అయ్యి 24 గంటల్లోనే హిస్టరీ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ధనుష్ ఈ టీజర్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ నమోదు చేసి కోలీవుడ్ లోనే హైయెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ గా రికార్డ్ నెలకొల్పింది.దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అని అర్ధం అవుతుంది.ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
కాగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.