టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబుకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని తెలిపారు.
ఎన్టీఆర్ మృతితోనే టీడీపీ చచ్చిపోయిందని మంత్రి జయరాం విమర్శించారు.2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారన్నారు.సీఎం జగన్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదని తెలిపారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధమని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.