తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు.తనపై పెట్టిన ఛార్జ్ షీట్ నిరూపించకపోతే లీగల్ గా ముందకు వెళ్తానని తెలిపారు.
తనకు మూడు వందల ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే పేదలకు పంచుతానన్నారు.అదేవిధంగా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు.
తనపై చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయాలని సూచించారు.చట్ట సభలకు తనను రావొద్దని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని ఎమ్మెల్యే రేగా ప్రశ్నించారు.
ప్రజలే తమకు అల్టిమేటం అని తెలిపారు.