టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన చూపుడు వేలికి ఇటీవల ఉంగరం పెట్టుకోవడం తెలిసిందే.రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలలో పర్యటిస్తున్న క్రమంలో.
ఎప్పుడు మామూలుగా ఉండే చంద్రబాబు ఎడమచేతి చూపుడు వేలికి ఒక ప్లాటినం ఉంగరం పెట్టుకోవడం జరిగింది.దీంతో అందరి చూపు ఆ ఉంగరం పై పడటంతో పాటు పెద్ద చర్చ సాగింది.
ఈ క్రమంలో ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉందని.అది తన ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని అంతా కంప్యూటర్ రికార్డింగ్ తో జరుగుతుందని.
సరి చేసుకోవాల్సి వస్తే మరుసటి రోజు రిపోర్టు చూసి సరి చేసుకుంటానని చంద్రబాబు తెలియజేశారు.
ఉదయమే నిద్రలేచిన వెంటనే కంప్యూటర్ లో ప్లాటినం ఉంగరం పంపిన రిపోర్ట్ చూసుకుని చెక్ చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.
దీంతో చంద్రబాబు ఉంగరంపై విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో సెటైర్ లు వేశారు.ఏమన్నావ్ చీప్ ట్రిక్స్ ముసలినాయుడు? నీ ఉంగరంలో చిప్ ఉందా? ఎవరేం చేసేది, ఎప్పుడు నిద్రపోయేది, పెళ్ళాంతో కాపురం చేసేది నీ కంప్యూటరుకు సమాచారం ఇస్తుందా! నీ బ్రెయిన్లో ఫ్యూజులు ఎగిరాక Cognitive Impairment అనే ఆఖరిదశలో ఉన్నావు.భ్రాంతికిలోనై ఇలాంటి కధలు అల్లుతావా? నీ పిచ్చి ముదిరింది.అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు.