టాలీవుడ్ లో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి వేరేలా ఉండేది.ప్రతి హీరో కూడా దాదాపు సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండేవాడు.
కానీ నేటి రోజుల్లో మాత్రం అటు ప్రేక్షకులకి హీరోలకి మధ్య దూరం బాగా పెరిగిపోతుంది.ఎందుకంటే ఒక్కో సినిమాకి గ్యాప్ నెలలు కాదు సంవత్సరాలు తీసుకుంటు ఉండడం గమనార్హం.
ఒకవైపు షూటింగ్ లేట్ అవుతూ ఉంటే మరోవైపు అటు కరోనా కారణంగా ఇబ్బందులు.చివరికి ఒక సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏళ్ల సమయం పడుతుంది అని చెప్పాలి.ఇలా ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకున్న హీరోల గురించి తెలుసుకుందాం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా చేసిన తర్వాత ప్రతి సినిమాకి కూడా దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటున్నాడు.2019 ఆగస్టులో సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ సాహో సమయంలోనే రాధేశ్యామ్ మొదలుపెట్టాడు.కానీ ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.ఎట్టకేలకు మార్చి 11వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
జూనియర్ ఎన్టీఆర్ 2018లో అరవింద సమేత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ తర్వాత రాజమౌళితో త్రిబుల్ ఆర్ సినిమా కమిట్ అయ్యాడు.ఇక రాజమౌళి సినిమా అంటే ఎలాగో లేట్ అవుతుంది.ఇక దానికి తోడు కరోనా వైరస్ అనేసరికి ఏకంగా నాలుగేళ్ల నుంచి ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
రామ్ చరణ్ 2019 లో వినయ విధేయ రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ తర్వాత త్రిబుల్ ఆర్ కమిట్ అవ్వడంతో ఏ సినిమా ఒప్పుకోలేదు.
ఇక మూడేళ్ల గ్యాప్ అవుతున్న ఇంకా చరణ్ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ 2020లో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటి ఇప్పటి వరకు ఈ హీరో దగ్గరనుంచి ఏ సినిమా రాలేదు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్కు సిద్ధంగా ఉంది.
మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఇలా ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకున్న హీరోగా కొనసాగుతున్నాడు.2019లో ఎఫ్ 2, గద్దల కొండ గణేష్ సినిమాలతో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ గని అనే సినిమాలో నటిస్తున్నాడు.అయితే మూడు ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను ఏప్రిల్ 8 వ తేదీన పలకరించపోతున్నాడు.
యంగ్ హీరోలే కాదు సీనియర్ హీరో చిరంజీవి సైతం అక్టోబర్లో సైరా నరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు.మూడేళ్లు గడుస్తున్నా ఇంకా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.కాగా ప్రస్తుతం ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి.