ముంబై (ఇండియా), మార్చి 4, 2022: భారతీయ మల్టీనేషనల్ గ్రూప్, ఆఫ్- హైవే టైర్ మార్కెట్ లో అంతర్జాతీయ అగ్రగామి అయిన బాల్ కృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బీకేటీ) తన ప్రచారకర్తగా సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ ను నియమించింది.
ఈ సందర్భంగా బాల్ కృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ పొద్దార్ మాట్లాడుతూ, ‘‘యూత్ ఐకాన్ రణ్ వీర్ సింగ్ తో మా బ్రాండ్ భాగస్వామ్యాన్ని ప్రకటించేందు కు ఎంతగానో ఆనందిస్తున్నాం.
కఠోర పరిశ్రమ, ఉత్కృష్టత సాధించడం ద్వారా ఆయన సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచారు.అదే ఆయనను మా బ్రాండ్ ను ప్రముఖంగా చాటిచెప్పేం దుకు ప్రచారకర్తగా ఎంచుకునేలా చేసింది’’ అని అన్నారు.
‘‘బీకేటీ, రణ్ వీర్ సింగ్ లను వారి ధోరణుల్లో వ్యక్తిత్వం, వినూత్నతల కారణంగా ‘స్వతంత్రు’ లుగా వ్యవహరిస్తుంటారు.ఈ లక్షణాలతో కూడిన వ్యక్తితో భాగస్వామ్యం మాకెంతో ఆనందదా యకం.మా ఉత్పాదనల గురించి భారతదేశవ్యాప్తంగా అవగాహన పెంచడంలో రణ్ వీర్ మాకు ఎంతగానో తోడ్పడుతారని మేం విశ్వసిస్తున్నాం.రాబోయే ఏళ్లలో విజయవంతమయ్యే భాగస్వామ్యం కోసం మేం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.
బీకేటీ టైర్స్ ప్రచారకర్తగా తన పాత్ర గురించి రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ, ‘‘బీకేటీ టైర్స్ కు ప్రాతినిథ్యం వహించడం మాకెంతో ఆనందదాయకం.కలసి వృద్ధిచెందడం అనేది వారి ఆశ యం.అది ప్రకాశవంతమైన, మెరుగైన భవిష్యత్ కోసం కలసి మార్పు చెందడాన్ని, వృద్ధి చెం దడాన్ని సూచిస్తుంది.అది నా మాదిరిగానే ఉంది.బీకేటీ ప్రపంచంతో, దాని విలువలతో అను బంధం నాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
35 ఏళ్లుగా బీకేటీ వ్యవసాయం, నిర్మాణరంగం, పారిశ్రామికం లతో పాటుగా ఎర్త్ మూవింగ్, పోర్ట్, మైనింగ్, ఏటీవీ, గార్డెనింగ్ అప్లికేషన్స్ వంటి స్పెషలిస్ట్ టైర్ విభాగాలపై విజయవంతంగా దృష్టి పెట్టగలిగింది.3,200కు పైగా హై పర్ ఫార్మెన్స్ స్పెషలిస్ట్ టైర్ల తో కూడిన విస్తృత ఉత్పాదన శ్రేణిని అందిస్తోంది.ఆఫ్ – హై వే టైర్ పరిశ్రమలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బీకేటీ ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది.
భారతదేశంలో ఐదు టైర్ ఉత్పత్తి కేంద్రాలను, యూరప్, నార్త్ అమెరికాలలో మూడు బిజినెస్ యూనిట్లను కలిగిఉంది.