సాధారణంగా బరువు తగ్గాలనే అతి ఉత్సాహంతో కొందరు ఎంతో కఠినమైన డైట్లను ఫాలో అవుతుంటారు.ఫలితం ఎంత ఉంటుంది అన్నది పక్కన పెడితే.
కఠినమైన డైట్ల వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా అలసట, నీరసం, కండరాల బలహీనత, తల నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
అందుకే కఠినమైన ఆహార నియమాలతో కాకుండా సింపుల్ డైట్తో వేగంగా బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసు కుందాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండంటే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టును తొలగించి తినాలి.
వెల్లుల్లి శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించడమే కాదు.వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి.
ఆ తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం కలిపి సేవించాలి.గంట అనంతరం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్, ఓట్స్ ఆమ్లెట్, ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్, స్మూతీలు వంటి వాటిని తీసుకోవచ్చు.
లేదా ఇడ్లీ, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలను కూడా తినొచ్చు.
మధ్యాహ్నం భోజనంలో చాలా మంది రైస్ను ఎవైడ్ చేస్తుంటారు.
కానీ, ఆ అవసరం లేదు.ఏదో ఒక కర్రీతో బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ లేదా బ్లాక్ రైస్ను చక్కగా తీసుకోవచ్చు.
ఆపై ఒక కప్పు పెరుగును తినండి.
స్నాక్స్ టైమ్లో ఒక కప్పు గ్రీన్ టీతో పాటు ఉడికించిన శెనగలు, వేరుశెనగలు, మిక్స్డ్ నట్స్, ఖర్జూరాలు, ఫ్రూట్స్, క్యారెట్స్ వంటి వాటిని స్నాక్స్గా తినొచ్చు.డిన్నర్లో రోటి, అటుకుల పోహ, మల్టీ గ్రెయిన్ దోసె వంటి వాటిని తీసుకోవాలి.రాత్రి నిద్రించే ముందు మరో రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.
అలాగే ప్రతి రోజు అర గంట నుంచి గంట పాటు వ్యాయామాలు చేయాలి.రోజుకు ఎనిమిది గ్లాసుల వాటర్ను తప్పని సరిగా తీసుకోవాలి.షుగర్, షుగర్తో చేసే ఆహారాల జోలికి అస్సలు వెల్లకూడదు.అల్లం, నల్ల మిరియాలు, పచ్చి మిర్చి, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి వాటిని రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
మరియు నాన్ వెజ్ను ఓవర్గా తినడం తగ్గించాలి.అంతేనండీ.
ఈ సింపుల్ డైట్ను పాటిస్తే పది రోజుల్లోనే బరువు తగ్గడాన్ని గమనిస్తారు.