తోపుదుర్తి మహిళా సహకార సంఘం పాలడైరీలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాప్తాడు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.తెదేపా గౌరవ సభల పేరుతో మాజీ మంత్రి పరిటాల సునీత గ్రామాలలో తమపై ఆరోపణలు చేస్తున్నారని అనంతపురంలో ఆయన మండిపడ్డారు.
మీ లాగా మనుషులను నిర్మూలించి ఆస్తులు సంపాదించుకోలేదని విమర్శించారు.అనవసరమైన ఆరోపణలు చేసినందుకు మహిళా సంఘం సభ్యులకు మాజీమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.సంఘంలో 3871 మంది సభ్యులు ఉన్నామన్నారు.
పాడి రైతుల అభివృద్ధి కోసం తాము పాటుపడుతూ ఉంటే లేనిపోని ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.