టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి మనందరికీ తెలిసిందే.శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.
ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు శేఖర్ కమ్ముల.ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ సాయి పల్లవి నటించింది.
దీనితో శేఖర్ కమ్ముల తరువాత సినిమాలో కూడా సాయి పల్లవి నే హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి.అయితే అందరూ సాయి పల్లవిని శేఖర్ కమ్ముల తన తర్వాత సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాడు అని అందరూ భావించారు.
కానీ ఈ విషయంలో శేఖర్ కమ్ముల ప్లాన్ మాత్రం వేరేగా ఉందట.శేఖర్ కమ్ముల తర్వాత సినిమాని తమిళ హీరో ధనుష్ తో ప్లాన్ చేశాడట.
ఆ సినిమాను పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కించబోతున్నారట.ఆ సినిమాలో కథకు తగ్గట్టుగా, సినిమా కు తగ్గట్టుగా బాలీవుడ్ హీరోయిన్స్ ని కథానాయికగా ఎంపిక చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ ఫై నిర్మించనున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది అని తెలుస్తోంది.ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమా హీరో ధనుష్ కి మంచి పేరు తెస్తుందని భావిస్తున్నారు మూవీ మేకర్స్.
గత ఏడాది తమిళంలో జగమేతంత్రం, బాలీవుడ్ లో అత్రంగి రే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు ధనుష్.ఇక ఈ ఏడాది ది గ్రేమేన్ మారన్, తిరుచిత్రంబళం, నానే వరునేన్ సినిమాలతో పాటు తెలుగు, తమిళం భాష లో రూపొందుతున్న సార్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.శేఖర్ కమ్ముల హీరో ధనుష్ తో తెరకెక్కించబోయే సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అదే కనుక నిజమైతే శేఖర్ కమ్ముల ఈ సినిమా తో సాయి పల్లవి ని పక్కనపెట్టి చేసినట్లే అని చెప్పవచ్చు.