సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మోకాలు సర్జరీ కోసం ఫారిన్ వెళ్లిన విషయం తెలిసిందే.అయితే అక్కడనుండి దుబాయ్ లో కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని తిరిగి ఇండియాకు వస్తాడని టాక్.
అయితే ఈలోగా తను చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మాత్రం ఆగకూడదని చెప్పాడట మహేష్.పరశురాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
మహేష్ మళ్లీ సెట్స్ కు రావడానికి రెండు నెలలు టైం పట్టేలా ఉంది.అయితే అప్పటివరకు సినిమా షూటింగ్ ఆపకుండా చేయాలని చెప్పాడట.
సినిమాను అనుకున్న విధంగా ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలంటే తప్పనిసరిగా అనుకున్న టైం కు సినిమా పూర్తి చేయాల్సిందే.అసలైతే 2022 సంక్రాంతికి రిలీజ్ అనుకున్న సర్కారు వారి పాట ఏప్రిల్ 1కి వాయిదా పడింది .బ్యాంక్ స్కాం ల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో మహేష్ మరోసారి పోకిరి లుక్ తో అలరిస్తాడని అంటున్నారు.సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో కూడా తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.మరి ఈ సినిమా అంచనాలకు తగినట్టుగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.