ఒక జలపాతంలో పారే నీటిలో పొరపాటున ఎవరైనా పడితే చాలు.వారు రాళ్లుగా మారి పోవడం ఖాయం.
అసలు జలపాతంలోకి వెళ్తే రాయిగా మారిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ.వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది అక్షర సత్యం.ఇది ఎలా సాధ్యం అవుతుందనే డౌట్ మీకు రావచ్చు.అయితే రాయిగా మార్చే జలపాతం వెనుక ఒక పెద్ద రహస్యమే దాగుంది.అది ఎక్కడుంది, దాని రహస్యం ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లాండ్ దేశంలోని మదర్ షిప్టాన్స్ కేవ్ స్థానికంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
డ్రాపింగ్ వెల్ అని కూడా దీనికి పేరుంది.దీని పేరు చెప్పగానే చాలా మంది ప్రజలు భయపడిపోతుంటారు.
ఇందుకు కారణం ఇది దేనినైనా రాయిగా మార్చగలదు.ఈ ప్రాంతంలో ఒక నీటి బుగ్గ ఉంటుంది.
దాని నుంచి ఎల్లప్పుడూ నీళ్లు జలపాతంలా కిందకి ప్రవహిస్తాయి.ఈ నీళ్లకు ఎలాంటి వస్తువునైనా రాయిలా మార్చగల శక్తి ఉంటుంది.
పొరపాటున కాలు జారి పడితే మనుషులు కూడా రాయిలా మారే ప్రమాదం ఉందని చాలామంది భయపడిపోతుంటారు.
స్థానికుల కథనం ప్రకారం, మదర్ షిప్టాన్స్ కేవ్ గుహలో ఒక వేశ్య ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఈ చిన్నారిని దెయ్యమని భావించిన అక్కడి ప్రజలు ఆమెను వెళ్లగొట్టారట.దాంతో ఆమె శపించిందని.
ఆమె శాపంతోనే ఈ గుహలోని వస్తువులన్ని రాళ్లగా మారిపోతున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీని వెనుక సైన్స్ దాగుందని కనుగొన్నారు.
నీటి బుగ్గ నుంచి జాలువారే నీటిలో ఉండే లక్షణాల వల్లే వస్తువులు రాళ్లుగా మారిపోతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఈ నీటిలో ఎక్కువగా సున్నపురాయి ఉంటుంది.అయితే నీరు తాకిన ప్రతి వస్తువు సున్నపురాయి నిక్షేపాలతో రాయిలా గట్టిపడుతుంది.కొన్ని సంవత్సరాల్లోనే నీటిలోని ఈ సున్నపురాయి నిక్షేపాలు వస్తువులపై ఒక పొరలా ఏర్పడి దాని రాయిగా మార్చేస్తాయి.
అయితే ఈ జలపాతంలో వేసిన ప్రతి వస్తువు రాయిగా మారిపోతుందని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు.మరికొందరు ఇతర వస్తువులను తీసుకొచ్చి ఇందులో వేలాడదీస్తున్నారు.అవన్నీ కూడా రాళ్ళలా మారిపోతున్నాయి.అయితే ప్రపంచంలో ఇలాంటి జలపాతాలు మరెక్కడా లేవని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు.