అలనాటి తార అభిమానులంతా ఎంతో ఇష్టంగా పిలుచుకునే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే.ప్రెసెంట్ జాన్వీ కపూర్ బాలీవుడ్ వరుస సినిమాలతో దూసుకు పోతుంది.
ఇప్పటికే ఈ బ్యూటీ కావలసినంత గుర్తింపు తెచ్చుకుంది.సినిమాల్లో ఎప్పుడు బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పుటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నాయి.అంతేకాదు అమ్మడి ఫాలోయింగ్ కూడా రోజురోజుకూ పెరుగుతుంది.ఇక తాజాగా ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఇక అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఈ ఫొటోలతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నట్టు ఉంది జాన్వీ.ఈ ఫొటోల్లో ఓరచూపులు చూస్తూ అందరిని తన అందంతో కట్టి పడేస్తుంది.ఇక ఈమె ఈ ఫోటోలను షేర్ చేసిన గంటలోనే అవి వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ అమ్మడు ప్రెసెంట్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
ఇక అందుకే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో కష్టం అయ్యేలానే కనిపిస్తుంది.కానీ ఇటీవలే జాన్వీ ఎన్టీఆర్, కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా కోసం ఇప్పటికే జాన్వీ కపూర్ ను కొరటాల శివ సంప్రదించారట.
మరి త్వరలోనే ఈ విషయం అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు టాక్.టాలీవుడ్ లో మంచి లాంచింగ్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న జాన్వీ ఈ సినిమాతో కనుక ఎంట్రీ ఇస్తే ఇక తిరుగుండదు అని అంత అనుకుంటున్నారు.