ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ఆయన ఆలోచనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అల్లు అరవింద్ స్ట్రాటజీ లో డిఫరెంట్ గా ఉంటాయి, అదేవిధంగా అతడి ఆలోచనలు కూడా చాలా వరకు సక్సెస్ అవుతుంటాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అందుకే మీడియా, ఇండస్ట్రీ ఎప్పుడూ అల్లు అరవింద్ ఏం చేస్తున్నాడు అన్న దానిపై ఒక కన్నేసి ఉంచుతారు.ఇక ప్రస్తుతం అల్లు అరవింద్ తన దృష్టి మొత్తం పోటీ ప్లాట్ ఫామ్ ఆహా పై పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే ఒకప్పుడు ఆహా పెట్టినప్పుడు ఇది మెగా హీరోల సినిమాలకు షోలకు అండగా నిలుస్తుందని అందరూ భావించినప్పటికీ, అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి.
తెలుగు లో ఓ టి టి మార్కెట్ లో మేజర్ షేర్ ను పొందేందుకు అల్లు అరవింద్ చాలా కష్టపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే పలువురు స్టార్స్ ని తీసుకువచ్చి వెబ్ సిరీస్ లు అలాగే టాక్ షోలు ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తో ఒక టాక్ షో ప్లాన్ చేశారు.
ఈ షో ఇంకా స్టార్ట్ కాకముందే మంచి క్రేజ్ ను తెచ్చుకుంది.దీనితో బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఆ షో కోసం ఫాన్స్ ఆహా ఫ్లాట్ ఫామ్ కి వస్తారు.
అలాగే హీరోయిన్ సమంత తో కూడా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అరవింద్ మరొకటి స్టెప్ వేసి మోహన్ బాబు నీ సైతం ఆహా కి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మోహన్ బాబు తో అల్లు అరవింద్ ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.తమిళ ఫిలిం మేకర్ ఒకరు ఈ సిరీస్ లో నిమిత్తం కథతో ఆహాని ఎప్రోచ్ అయ్యారని సత్య రాజ్ తో చేద్దామని వాళ్ళ ఆలోచన అయితే, అల్లు అరవింద్ మాత్రం మోహన్ బాబుతో చేస్తే బాగుంటుందని చెప్పి టీమ్ తో ఎప్రోచ్ అవుతున్నట్లు సమాచారం.