ఇటీవల కేంద్రమంత్రిగా పదవి చేపట్టిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడం జరిగింది.ప్రతి జిల్లాలో చేపడుతున్న ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి.
కృషి చేస్తూ ఉన్నారు.నిన్న సూర్యాపేటలో ఇంకా పలు చోట్ల ప్రజా ఆశీర్వాద యాత్ర సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాని మరికొన్ని సంవత్సరాలు కేసీఆర్ పరిపాలిస్తే దివాలా తీయటం గ్యారెంటీ అని తెలిపారు.అంతేకాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ నీ ఓడించడానికి కెసిఆర్ కుట్ర పన్నారని తెలిపారు.
![Telugu Bandi Sanjay, Cm Kcr, Kishan Reddy-Telugu Political News Telugu Bandi Sanjay, Cm Kcr, Kishan Reddy-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2021/08/Union-Minister-jog-Serious-Comments-on-KCR-Kishan-Reddy-KCR-Bandi-Sanjaylates.jpg)
ఇదే సరైన సమయం అధికారం నుండి కేసీఆర్ ని గద్దె దించాలి అని.ప్రజలకు పిలుపునిచ్చారు.ఇదే సమయంలో కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.ట్విటర్ లో తప్ప మరెక్కడా మాట్లాడారని మండిపడ్డారు.ఇదే తరుణంలో ప్రపంచవ్యాప్తంగా 45 కరోనా వ్యాక్సిన్ లు తయారవుతుంటే అందులో రెండు భారతదేశంలో తయారవుతున్నాయని ఆ రెండిటిలో ఒకటి తెలంగాణలో తయారవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి తో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరికొంత మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు.