ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ప్రాంతం జాతీయ రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న హైవే దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.మేటర్ లోకి వెళ్తే నిర్మాణంలో ఉన్న హైవే వంతెన సైడ్ పిల్లర్ పక్కనే ఉన్న రహదారిపై వెళ్తున్న వాహనాలపై కుప్పకూలిపోయింది.
జరిగిన ఈ దారుణమైన సంఘటన లో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు.
అక్కడికక్కడే మృతి చెందారు.బ్రిడ్జ్ పిల్లర్ భారీ శబ్ధంతో కూలిపోవడంతో.
స్థానికంగా ఉన్న ప్రజలు.భయాందోళనతో పరుగులు తీశారు.
ఇదే క్రమంలో రహదారిపై వెళ్తున్న వాహనదారులు.ఒక్క సారిగా ఉలిక్కి పడి ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు.కూలిన వంతెన కింద రెండు మృతదేహాలు కారులో ఉండటంతో.అదే కారులో ప్రయాణిస్తూ సురక్షితంగా బయటపడ్డ మిగతావాళ్ళు.
వాళ్ల మృతదేహాలు చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.ఇదే క్రమంలో కూలిన వంతెన కింద మిగతా వారు ఎవరైనా ఉన్నారేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జరిగిన సంఘటన తెలుసుకున్న వెంటనే హైవే ప్రాంతానికి చెందిన అధికారులు అదే రీతిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని. కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు.