జగన్ రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ నేత సీరియస్ కామెంట్స్..!!

కాంగ్రెస్ సీనియర్ నేత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తన రెండు సంవత్సరాల పరిపాలన లో ఇచ్చిన హామీలు నెరవేర్చినటు జగన్ చెప్పుకోవటం అబద్ధం అంటూ, అబద్ధాలు ప్రచారం చేయటంలో జగన్ గ్లోబెల్ ను మించిపోయారని తులసి రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు.

 Congress Senior Leader Tulasi Reddy Serious Comments On Ys Jagan, Tulasi Reddy,-TeluguStop.com

వైయస్సార్ పెళ్లి కానుక ఏమైందని ప్రశ్నించారు.ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అనేక వివాహాలు జరిగాయి.

ఇప్పుడు వరకు నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు.

తన మేనిఫెస్టో ని మత గ్రంథాలతో పోల్చి .చేతల్లో మాత్రం చిత్తు కాగితంలా చేశారని జగన్ పై సెటైర్లు వేశారు తులసిరెడ్డి.అదేవిధంగా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద కొంత డబ్బు ఇస్తామని ప్రకటించారు ఆ హామీలు కూడా నెరవేర్చలేదు అని తులసి రెడ్డి మండిపడ్డారు.

ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు అదేరీతిలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి క్యాలెండర్.ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఇలా అనేక విషయాలలో ఇచ్చిన హామీలు ఇంకా జగన్ నెరవేర్చలేదు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube