పకృతిని నాశనం చేస్తున్న మానవుడు తన ప్రమాదాన్ని తానే తెచ్చుకుంటున్న విషయాన్ని విస్మరిస్తున్నాడు.ఇప్పటికే మనుషులు చేసిన విద్వంసం వల్ల జరగరాని నష్టం జరిగిపోయింది.
ఇంకా ముందు ముందు ముప్పు అధికంగా పొంచి ఉంది.ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మనిషి విఫలం అయిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ పేరు తరచుగా వినిపిస్తుండగా, పర్యావరణ ముప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల సూచీలో 0.510 మార్కులతో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచిందట.అంతేకాదు, దేశంలో పర్యావరణ ముప్పునకు అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న 25 శాతం జిల్లాల జాబితాలో రాష్ట్రానికి చెందిన మూడు జిల్లాలు ఉన్నాయని ఈ మేరకు కేంద్రం నిన్న విడుదల చేసిన పర్యావరణ ముప్పు సూచీ నివేదికలో పేర్కొంది.ఇకపోతే ఏపీలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడం, నీటి ద్వారా సోకే జబ్బులు అధికంగా ఉండడం వంటి అంశాలు ఈ రాష్ట్రానికి ప్రతికూలంగా మారాయని అంటున్నారు.