నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ నభా నటేష్.మొదటి సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకొని వరుస అవకాశాలతో ఈ అమ్మడు టాలీవుడ్ లో దూసుకుపోతుంది.కుర్ర హీరోలకి ప్రధాన జోడీగా మారిపోయింది.అయితే సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న ఈ అమ్మడితో జత కట్టడానికి కుర్ర హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ భామ నితిన్ కి జోడీగా మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
దీంతో పాటు వరుణ్ తేజ్ గని సినిమాలో కూడా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు గురించి మరో హాట్ న్యూస్ వినిపిస్తుంది.
మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా ఈ భామ మరోసారి కనిపించబోతుందని టాక్ గట్టిగా నడుస్తుంది.గతంలో రవితేజతో డిస్కో రాజా సినిమాలో నభా నటేష్ జోడీగా నటించింది.
అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.ఇక రవితేజ తాజాగా క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.దీంతో పాటు మరో ముగ్గురు దర్శకులని లైన్ లో పెట్టాడు.
వారిలో త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు.దాని తర్వాత వక్కంతం వంశీ, మారుతి దర్శకత్వంలో కూడా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక మారుతి సినిమా కోసం రవితేజకి జోడీగా నభా నటేష్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.రవితేజ కూడా నభా నటేష్ కి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.