టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ లలో ఒకరైన శ్యామ్ కె నాయుడుపై గతంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన శ్రీసుధ తాజాగా తనపై హత్యాయత్నం జరిగిందని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాను విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవర్ పై వెళుతున్న సమయంలో దుండగులు తనపై హత్యాయత్నం చేశారని శ్రీసుధ పేర్కొన్నారు.
శ్యామ్ కె నాయుడు తనపై హత్యాయత్నం చేయించి ఉండవచ్చని తాను భావిస్తున్నానని ఆమె వెల్లడించారు.
శ్యామ్ కె నాయుడు తనను వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఐదు సంవత్సరాల పాటు ఆయనతో సహజీవనం చేశానని కొన్ని నెలల క్రితం శ్రీసుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత శ్యామ్ కె నాయుడుపై చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని.అతని వల్ల తన ప్రాణాలకే అపాయం ఉందని శ్రీసుధ ఫిర్యాదులో పేర్కొన్నారు.విజయవాడలో తనపై జరిగిన హత్యాయత్నానికి, హైదరాబాద్ కేసుకు సంబంధం ఉందని ఆమె పేర్కొన్నారు.
తనను హత్య చేయించాలనే ఆలోచనతో ఈ యాక్సిడెంట్ చేయించి ఉండవచ్చని శ్రీసుధ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిన్న సాయంత్రం పోలీసులకు శ్రీ సుధ ఫిర్యాదు చేయగా పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.గతంలో శ్రీసుధ ఎస్సార్ నగర్ సీఐ డబ్బులు డిమాండ్ చేశారని.
నిందితునికి తనకు మధ్య రాజీ జరిగినట్లు ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించారని ఆమె పేర్కొన్నారు.
శ్రీసుధ శ్యామ్ కె నాయుడుపై చేస్తున్న ఆరోపణలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.
శ్రీ సుధ డాక్టర్ చదివి సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించి గుర్తింపు తెచ్చుకున్న శ్రీసుధతో కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు శ్యామ్ కె నాయుడిపై చేసిన ఫిర్యాదుల విషయంలో రాజీకి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తోంది.