కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీలో ఏ సినిమా అయిన తీయాలని అనుకుంటే కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.” గాయత్రి” సినిమా అనంతరం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏ సినిమాలో హీరోగా నటించకుండా విశ్రాంతి తీసుకున్నాడు.అనంతరం కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించిన మహానటి సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో నటించి అందరిని మెప్పించాడు.
అలాగే గత సంవత్సరం సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా అనే సినిమాలో మోహన్ బాబు ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నడు.
ఇది ఇలా ఉండగా తాజాగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ సినిమాని శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలనే పూజా కార్యక్రమం నిర్వహించి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సినిమా కు సంబంధించి పూర్తి వివరాలను మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ పోస్టర్ లో భాగంగా మోహన్ బాబు మెడలో రుద్రాక్షమాలతో దేశం కోసం ఎంతో తపన పడే వ్యక్తిగా కనబడుతున్నాడు.ఇక ఈ సినిమా టైటిల్ ని బట్టి సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ప్రస్తుత రోజుల్లో సగటు భారతీయుడు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో అన్న ఉద్దేశంతో ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
దాదాపు 500ల చిత్రాలలో వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అండ్ దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా ముందుకు రాబోతుంది.ఈ సినిమాతో మోహన్ బాబు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ కింగ్ గా నిలబడతారో లేదో అనేది సినిమా విడుదల ఎంత వరకు వేచి ఉండాల్సిందే.