టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో విరాటపర్వం కూడా ఒకటి.ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండగా రానా దగ్గుబాటి, సాయి పల్లవిలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమా కథ నక్సలిజం బ్యాక్డ్రాప్తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకోవడంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి ఒక జానపద గాయని మరియు నక్సలైట్గా కనిపించనుంది.ఈ సినిమాలో ఎక్కువ మంది లేడీ స్టార్స్ నటిస్తుండటం, వారి పాత్రలు సినిమాకే హైలైట్గా నిలవనుందట.
ముఖ్యంగా సాయి పల్లవితో పాటు నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరిరావులు ఈ సినిమాలో పోషించే పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎమోషనల్గా వారికి బాగా నచ్చుతాయని తెలుస్తోంది.దీంతో ఈ సినిమాలో మహిళాశక్తి ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంటుందో ప్రేక్షకులకు చూపెట్టనున్నాడు డైరెక్టర్.
కాగా ఈ సినిమా షూటింగ్ను ఇప్పుడు తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ షూటింగ్ను వికారాబాద్ అడవుల్లో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో 1990 నాటి సామాజిక పరిస్థితులను మన కళ్లకు కట్టినట్లు చూపెట్టనున్నాడు డైరెక్టర్.
ఈ సినిమాను సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.