తండ్రి బాటలో నిర్మాతగా మారబోతున్న కీర్తి సురేష్

సావిత్రి బయోపిక్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ కీర్తి సురేష్.ఆ సినిమా కంటే ముందుగా కీర్తి మూడు సినిమాలు చేసిన నటిగా బెస్ట్ అని అనిపించుకుంది.

 Keerthi Suresh Turned As A Producer, Kollywood, Web Series, Kerthi Suresh, Tolly-TeluguStop.com

అయితే మహానటి సినిమాలో తన నట విశ్వరూపం చూపించి నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది.మరోసారి సావిత్రిని వెండితెరపై గుర్తుచేసింది.

ఆ సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదగడానికి బలమైన పునాదులు వేసుకుంది.

తమిళంలో విజయ్, సూర్య, విశాల్, విక్రమ్ లాంటి స్టార్స్ తో రొమాన్స్ చేసింది.ఇక ఇప్పుడు ఏ హీరోయిన్ కి లేని విధంగా ఏకంగా పది సినిమాలని కీర్తి సురేష్ లైన్ లో పెట్టింది.

వీటిలో చాలా సినిమాలు పెద్ద ప్రాజెక్ట్స్ కావడం విశేషం.ఈ సినిమాలు రిలీజ్ అయితే కీర్తి సురేష్ సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ కావడం పక్కా అనే మాట వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ఇప్పుడు నిర్మాతగా మారాలనుకుంటున్నారట.దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగి పోతున్నాయని సమాచారం.ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ కథ కీర్తీని బాగా ఆకట్టుకుంది.ఆ కథను తానే నిర్మాతగా తెరకెక్కిస్తానని దర్శకుడుకి మాట ఇచ్చి అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని తెలుస్తుంది.

కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ మలయాళంలో స్టార్ నిర్మాత అనే విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన సొంత ప్రొడక్షన్ విషయంలో తండ్రి సలహాలు కూడా తీసుకుంటుందని సమాచారం.

త్వరలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మరి ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ నిర్మాతగా తండ్రి వారసతాన్ని ఏ స్థాయిలో నిలబెడుతుందో అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube