సినిమాలు,సీరియల్ లు, సోషల్ పుస్తకాల ద్వారా మనకి మొదట పరిచయమైన మైసూరు రాజులు గొప్పతనం గురించి మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరి అలాంటి మైసూర్ రాజాలకు సంబంధించిన మైసూర్ ప్యాలెస్ ఇప్పటికీ పర్యాటక ఆకర్షణ ప్రాంతంగా ఉంది.తాజాగా మైసూర్ రాజు కుటుంబం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
మైసూరు రాజసంస్థానం యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ నేను రాజకీయాల్లో చేరాలా అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
దానితో ఆయన త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఆయన పెట్టిన పోస్ట్ పై నెటిజెన్లు భిన్నంగా స్పందించారు.మీలాంటి మంచి వారు రాజకీయాల్లోకి రావడం సరికాదు.అధికారం కోసం మిమ్మల్ని రాజకీయ నాయకులు దొంగను చేసే ప్రయత్నాలు చేస్తారు.
అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి అని కొందరు అభప్రాయపడగా,మరికొందరు మీలాంటి మంచివారు రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అని అభిప్రాయపడ్డారు.మరి ప్రజల అభిప్రాయాలను ఓపిగ్గా విన్న మైసూర్ యువరాజు రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశంపై మరికొన్ని రోజులు వేచి చూడాలి.