శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇటీవలే కత్తి మహేష్పై కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.అతడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.
కత్తి మహేష్ విషయం మరిచి పోకుండానే మరో అరెస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.హీరోయిన్ మాధవిలతపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యల కారణంగా కొందరి మనో భావాలు దెబ్బ తింటున్నాయి అనేది కేసు.
హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి మాధవిలతపై కేసు పెట్టాడు.
ఆమె గత కొన్ని రోజులుగా వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తుందని ఆమె వల్ల పలువురు మనోభావాలు దెబ్బ తిని బాధపడుతున్నారు అంటూ కేసులో పేర్కొన్నాడు.అతడి కేసును నమోదు చేసిన పోలీసులు 295 ఎ సెక్షన్ కింద మాధవిలతపై కేసు నమోదు అయ్యింది అంటూ పోలీసులు తెలియజేశారు.
![Telugu Gopikrishna, Kathi Mahesh, Madhavilatha- Telugu Gopikrishna, Kathi Mahesh, Madhavilatha-](https://telugustop.com/wp-content/uploads/2020/08/Kathi-Mahesh-Arrest.jpg)
బీజేపీలో నాయకురాలిగా వ్యవహరిస్తున్న మాధవిలత పై కేసు నమోదు అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటీ ఆమె కేసు వివరాలు ఏంటీ అనేది పోలీసులు త్వరలో మీడియాకు వెళ్లడి చేసే అవకాశం ఉంది.హీరోయిన్గా పరిచయం అయ్యి కొన్ని సినిమాలే చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత ఆఫర్లు లేక కనుమరుగయ్యింది.మళ్లీ రాజకీయాల పేరుతో తెర ముందుకు వచ్చింది.