ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈమద్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు.ఆయన చేస్తున్న వ్యాఖ్యల కారణంగా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గతంలో ఎప్పుడు కూడా రామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు.తన బాబాయికి చెందిన రమేష్ ఆసుపత్రి వార్తల్లోకి రావడంతో ఆయన తెరపైకి వచ్చాడు.
సొంత బాబాయిపై కేసు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆయన తట్టుకోలేక పోతున్నాడు.ఇదే సమయంలో ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం మొదలు పెట్టాడు.
రామ్ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన కేసు మారిపోదు.రామ్ ఈ విషయంలో ఇప్పటికే అనవసరంగా స్పందించారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో ఆయన మరింతగా వివాదాస్పద ట్వీట్స్ ను చేస్తున్న కారణంగా మీడియాలో అటెన్షన్ కూడా పొందుతున్నారు.ఇలాంటి వివాదాస్పద అంశాలతో రామ్ ఎప్పుడు కూడా మీడియాలో కనిపించలేదు.
కాని మొదటి సారి ఆయన ఇలా ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
మీడియా ముందుకు ఆయన రావడంపై కొందరు వ్యతిరేకిస్తూ ఉంటే మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు.
రామ్ హీరో అయ్యి ఉండకుంటే తన బాబాయికి మద్దతుగా మాట్లాడేవాడు కదా.హీరో అయినంత మాత్రాన మాట్లాడకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ సమయంలో కొందరు రామ్ను కులం పేరుతో విమర్శించారు.దాంతో కరోనా కంటే భయంకరమైనది కులం.దానికి దూరంగా ఉండకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతుంది అంటూ రామ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.