టాలీవుడ్లో ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తనదైన అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సె్స్ అయ్యింది.ఛలో సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలవడంతో వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి.
గీతాగోవిందం సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలల్లో నటించి సక్సెస్ సాధించింది.
ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’లో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది.
కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఆమె ఇంటికే పరిమితం అయ్యింది.ఈ క్రమంలో లాక్డౌన్ వేళ కర్ణాటకలోని తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతోంది.తాజాగా ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో ముచ్చటించిన రష్మిక, లాక్డౌన్ లాంటి సమయం మళ్లీ లభిస్తుందో లేదో అని అంది.ఇన్ని రోజుల పాటు పూర్తిగా కుటుంబ సభ్యులో గడిపే అవకాశం మళ్లీ లభిస్తుందో లేదో అని ఆమె అంటోంది.
కరోనా వైరస్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి సామాజిక దూరం పాటించాలని ఆమె ఈ సందర్భంగా ఫ్యాన్స్ను కోరింది.షూటింగ్లు మిస్ అవుతున్న బాధ ఉన్నప్పటికీ ఇంటికే పరిమితం కావడం సంతోషంగా ఉందని ఆమె అంటోంది.
కాగా పుష్ప సినిమా కోసం తాను రెడీ అవుతున్నానంటూ ఫ్యాన్స్కు తెలిపింది.