ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ల సంఖ్య మూడు మిలియన్లను చేరబోతుంది.మృతుల సంఖ్య లక్షల్లో నమోదు అవుతుంది.
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర దేశాలు వందల కోట్లల్లో డబ్బును ఖర్చు చేస్తూ వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి.
పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ను తయారు చేసి ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించాయి.మొదట జంతువులపై ట్రయల్స్ చేసి ఆ తర్వాత మనుషులపై ట్రయల్స్ చేస్తారు.
జంతువులపై పలు దఫాలుగా, పలు రకాలుగా చాలా నెలల పాటు పరిశోదన జరిపిన తర్వాత మనుషులపై పరిశోదన ప్రారంభిస్తారు.యూరప్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి రెండవ దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
యూరప్లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ను మనుషులపై ట్రయల్స్ వేయడం మొదలు పెట్టారట. ఒకటి రెండు నెలల్లో దాని ఫలితం వస్తుందని అంటున్నారు.
ఆ ప్రయోగం సక్సెస్ అయితే రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వెంటనే ఆ వ్యాక్సిన్ రావాలని అందరు దేవుళ్లను వేడుకుంటున్నారు.