ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఇప్పటి వరకు రాద్ధాంతం చేసిన విపక్షాలు ఇప్పుడు ఒక్కొక్కరుగా యూటర్న్ తీసుకుంటున్నారు.ముందుగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా తెలుగు బాషా అంతరించిపోతుందంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు.ఆ తరువాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు రావడంతో బాబు వెనక్కి తగ్గారు.
అంతేకాదు ఈ విషయంలో ఎవరూ స్పందించవద్దు అంటూ ఆదేశాలు కూడా జరీ చేసాడు.
అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నారు.
ఏకంగా మన నుడి మన నది అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు కూడా పవన్ సిద్ధం అవుతున్నారు.అయితే క్షేత్ర స్థాయిలో దీనిపై వ్యతిరేకత వస్తుదనడంతో పవన్ కూడా చంద్రబాబు వలే యూటర్న్ తీసుకున్నారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఇంగ్లిష్ మీడియం వద్దు అని నేను అనడంలేదు వదలొద్దు అంటున్నాను అంటూ పవన్ ట్విట్ చేశారు.