కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 11వ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి ఫోన్ లో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గా మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ నియమించారని చెప్పారు, హార్షనీయం.

 Mp Komatireddy Venkata Reddy Paid Tribute To Komatireddy Prateek Reddy's 11th D-TeluguStop.com

సీనియర్లతో మాట్లాడి హుజూరా బాద్ ఉపఎన్నికల్లో టీపీసిసి ఎందుకు ప్రచారం చేయలేదో విచారణ చేయాలి.మునుగోడు నియోజకవర్గంలో నాకు తెలియకుండా సభ పెట్టి నన్ను తిట్టడం పై, మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలి.

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త, పీసీసీ ప్రెసిడెంట్ సమానమేనని గతంలోనే చెప్పా, మళ్ళీ చెబుతున్నా.నల్గొండ జిల్లా కమిటీతో పాటు కొన్ని చోట్ల పీసీసీ కమిటీలో బలమైన నాయకులకు చోటు ఇవ్వలేదు.గాంధీ భవన్ లో పైరవీకారులకు ఇచ్చిన లిస్టును జిల్లా సీనియర్ నాయకులతో చర్చించలేదు.20 మాసాలవుతున్నా జిల్లాల వారీగా పీసీసీ ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టలేదు.

ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రైతు పాదయాత్ర పేరుతో ఉద్యమం చేయబోతున్నా.జనవరిలో చేయబోయే పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటాం.బ్రాహ్మణ వెళ్ళాంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులుపూర్తి చేయాలని రైతు ఉద్యమం.నాకు పేరు వస్తుందని లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టుకు 100కోట్లు ఎందుకు ఇవ్వడం లేదు.

తెలంగాణలో 5లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు.లోటు బడ్జెట్ ఉన్న పక్క రాష్ట్రంలో సీఎం జగన్ రోగాల బారిన పడిన వారికి వెయ్యి దాటితే బిల్లులు లేకుండా చేశారు.

ఇక్కడ లక్షల రూపాయల బిల్లు చెల్లించ లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు.పక్క రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు చేయడం లేదు.

కళాశాలలో ఫీజు రియాంబర్స్ మెంట్ లేక మా దగ్గరికి వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube