బాబోయ్ రెవెన్యూ సిబ్బందిపై మరో పెట్రో దాడి

ఏదైనా ఒక సంఘటన హైలెట్ అయితే ఇక వరుసగా అదే తరహాలో అటువంటి సంఘటనలు జరిగిపోతూ వుంటాయి.ఈమధ్య కాలంలో తెలంగాణలో రెవెన్యూ సిబ్బందిపై వరుసగా జరుగుతున్నపెట్రోల్ దాడులు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

 Farmer Pouring Petrol On Revenue Senior Assistant At Karimnagar-TeluguStop.com

అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి మీద దాడి చేయడం ఆమెను అక్కడికక్కడే సజీవదహనం చేయడం సంచలనం రేపింది.వరుసగా ఇదే తరహా లో లో మూడు సంఘటనలు చోటుచేసుకోవడంతో విధులు నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బంది వణికిపోతున్నారు.

కొంతమంది ఇప్పటికే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకుని మరి నిర్వహిస్తున్నారు.తాజాగా తెలంగాణలోనూ మరో రెవెన్యూ అధికారి పై పెట్రోల్ దాడి జరిగింది.

అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం లంబాడి పల్లి గ్రామానికి చెందిన రైతు కనకయ్య వెళ్ళాడు.

వెంటనే సీనియర్ అసిస్టెంట్ రామచంద్రన్ పై ఆకస్మాత్తుగా పెట్రోల్ చల్లాడు.

వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది కనకయ్యను గట్టిగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

చాలా కాలంగా నా భూ సమస్యను పరిష్కరించకుండా రెవెన్యూ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని కనకయ్య ఈ సందర్భంగా తన బాధను చెప్పుకున్నాడు.ఈ ఘటనతో తెలంగాణ రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహించేందుకు వణికిపోతున్నారు.

తమకు సరైన భద్రత ఏర్పాట్లు చేయకపోతే విధులు నిర్వర్తించలేమని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube