ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ఆధ్వర్యంలోని ఎంఐఎం పార్టీకి మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది.గురువారం ఈసీ ఓ ప్రకటన చేస్తూ, .
నిర్ణీత గడువులోగా పార్టీ ఆదాయ వ్యయాల ఆడిట్ నివేదిక సమర్పించనందున పలు పార్టీల గుర్తింపు రద్దు చేసే చర్యలు తీసుకున్నట్టు ఈసీ వివరించింది.
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.2015 లో జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం ఊహించని ఫలితాలు సొంతం చేసుకున్న ఎంఐఎం ఉత్తరాదిన పాగా దిశగా అడుగులు వేస్తోంది.ఔరంగాబాద్ మున్సిపాలిటీలో ఏకంగా 24 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుని స్ధానిక ఎన్నికలలో మరింత బలపడేందుకు సిద్దమవుతున్న తరుణంలో ఎంఐఎంకి ఈసీ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చినట్టే.
గత కొంత కాలంగా ఆడిట్ నివేదిక సమర్పించకపోతే మహారాష్ట్రలో రాజకీయ పార్టీల గుర్తింపు రద్దుచేస్తామని ఈసీ హెచ్చరించినా పట్టనట్టు వ్యవహరించిన 191 పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేయటం విశేషం.జాతీయ పార్టీగా ప్రకటించుకున్న ఎంఐఎంకి తాజా నిర్ణయం ఇబ్బంది కలిగించే అంశమే.
ఎన్నికల కమీషన్ నియమావళిని అనుసరించడంలో మహారాష్ట్ర స్ధానికి నేతలు కొన్ని లోపాలు చేసినందునే ఈ పరిస్తితి తలెత్తిందని, వీటిని చక్కదిద్దేలా చూస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.