సీఎం జగన్ మేనిఫెస్టోను 98 శాతం అమలు చేశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.తాజాగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు.
అదేవిధంగా అక్టోబర్ 1 నుండి కులాంతర వివాహం చేసుకునే వారికి రూ.లక్షా 20 వేలు అందిస్తామని తెలిపారు.
అనంతరం చంద్రబాబుపై మంత్రి మేరుగ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబులా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టమన్నారు.రాజకీయంగా దిగజారిపోయిన చంద్రబాబుకు.దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.
అమరావతి పేరుతో ఎవరు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యనించారు.