ప్రఖ్యాత విజ్డెన్ ఇటీవల వివిధ విభాగాలకు వార్షిక క్రికెట్ అవార్డులను ప్రకటించింది.ఈ విజేతలలో భారత సంతతికి చెందిన 18 ఏళ్ల ఆర్యమాన్ వర్మ (లెగ్ స్పిన్నర్)( Aryaman Varma ) కూడా ఉన్నాడు.
బెర్క్షైర్ (ఇంగ్లాండ్)లోని ఎల్టన్ కాలేజీకి( Elton College ) కెప్టెన్గా ఉంటూ 51 వికెట్లు పడగొట్టడంతో పాటు 300 పరుగులు చేయడం ద్వారా వర్మ విస్డెన్ స్కూల్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును( Wisden Schools Cricketer Of The Year Award ) గెలుచుకున్నాడు.మొత్తం మీద వర్మ అవార్డును గెలుచుకున్న 17వ వ్యక్తిగా నిలిచాడు.
2008లో ఈ అవార్డును తొలిసారిగా గెలుచుకుని ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో రికార్డుల్లో నిలిచాడు.2010లో మరో ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ఈ అవార్డును అందుకున్న మూడో విజేతగా నిలిచాడు.తాను ఈ అవార్డును గెలుచుకోవడం చాలా గొప్ప విషయమని వర్మ . జాతీయ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నాడు.తాను జిమ్ సెషన్ పూర్తి చేసి ఈమెయిల్ను చెక్ చేయగా ఈ వార్త కనిపించిందని పేర్కొన్నాడు.కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెప్పడానికి ముందు ఈ విషయాన్ని ఒకటికి రెండు సార్లు నిర్థారించుకున్నానని వర్మ అన్నాడు.

లండన్లో జన్మించిన 18 ఏళ్ల ఆర్యమాన్ వర్మ కుటుంబం ఢిల్లీకి చెందినది.అతను ముంబైలో చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు.ఈ ఏడాది ప్రారంభంలో ఐఎల్టీ 20 ఫ్రాంచైజ్ దుబాయ్ క్యాపిటల్స్.ఆస్ట్రేలియన్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ స్థానంలో ఆర్యమాన్ను తాత్కాలికంగా జట్టులోకి తీసుకుంది.టైటిల్ గెలిచినప్పుడు వర్మ ఈ జట్టులో భాగం.స్టార్ క్రికెటర్లు బట్లర్, బెయిర్ స్టో మాదిరిగా వర్మ కూడా ఏదో ఒక రోజున అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్కు ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు.
ఇప్పుడు నా వయసు కేవలం 18 సంవత్సరాలేనని .వైట్ బాల్ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్లో నేను ఎక్కడికి వెళ్లాలో ఖచ్చితంగా నిర్ణయించుకుంటానని వర్మ పేర్కొన్నాడు.

వర్మ గడిచిన మూడేళ్లుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్తో( Delhi Capitals ) నెట్ బౌలర్గా వ్యవహరిస్తున్నాడు.అతనికి కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav ) మెంటర్గా వ్యవహరిస్తున్నాడు.ఈ వయసులో ఎక్కువ మ్యాచ్లు ఆడాలని కుల్దీప్ భాయ్ తనకు సలహా ఇచ్చాడని.ఎంత అనుభవం ఉంటే అంత మంచి క్రికెటర్ అవుతావని ఆయన సూచించారని ఆర్యమాన్ వర్మ వెల్లడించాడు.