ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని( Balineni Srinivasa Reddy ) పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ పర్యటనలో ఈబీసీ నిధులను విడుదల చేయడానికి సీఎం మరియు జిల్లా నేతలు( CM jagan ), అధికారులు మార్కాపురం చేరుకున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి హెలిప్యాడ్ దగ్గరికి బాలినేని వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగిందంట.వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని దీంతో బాలినేని అలిగి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) స్పందించారు.కావాలని ఒక వర్గం మీడియా వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రజలలో వైసీపీ గ్రాఫ్ తగ్గదని స్పష్టం చేశారు.
వైసీపీలో అసమతి ఉందని తెగ ప్రచారం చేస్తున్నారు.నిజంగా అసమతి ఉంటే దాన్ని తగ్గించే శక్తి కూడా తమ దగ్గర ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.