యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
దీంతో ఈ సినిమా కోసం వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా పూర్వ జన్మల నేపథ్యంలో సాగే కథగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమాలో ఉండబోయే ఓ ట్విస్టుకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో ‘చేతి జాతకం’ అనే అంశం కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
హీరోహీరోయిన్లు తమ చేతి జాతకాలు చూపెట్టుకునే సమయంలో వచ్చే ట్విస్టు ఈ సినిమా కథను అమాంతం మార్చేస్తుందని చిత్రపురిలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.అంటే.మగధీర చిత్రంలో హీరోహీరోయిన్లు ఒకరి చేతులు మరొకరు తాకినట్లుగా ఈ సినిమాలో చేతి జాతకం ఈ సినిమా కథనే పూర్తిగా మర్చేస్తుందని తెలుస్తోంది.
ఈ వార్తతో సోషల్ మీడియాలో రాధేశ్యామ్ కథ ఇదేనంటూ పలు కథనాలు కనిపిస్తున్నాయి.
ఏదేమైనా ‘జాతకం’ కాన్సెప్టుతో ఈ పీరియాడికల్ రొమాంటిక్ కథను దర్శకుడు రాధాకృష్ణ ఎలా తీర్చిదిద్దాడనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు.
మరి రాధేశ్యామ్ చిత్రంలో ఈ జాతకం కాన్సెప్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.