విజయశాంతి ( Vijayshanthi ) పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం రాజకీయాలలో ( Politics ) ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఒకానొక సమయంలో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ హీరోలకు పోటీగా ప్రేక్షకులను మెప్పించారు .
ఇక విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా హీరోలకు ఏమాత్రం తీసిపోదని నిరూపించుకున్నారు.ఇక ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన ఈమె ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

తాజాగా విజయశాంతి నటించిన అర్జున్ సన్నాఫ్ వై జయంతి( Arjun Son Of Vyjayanthi ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఇకపై సినిమాలకు దూరంగా విజయశాంతి ఉండబోతున్నారని తెలుస్తుంది .ఈమె ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రజాసేవలోనే తాను గడుపుతానని ఇకపై సినిమాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు.అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విజయశాంతి తనకు పిల్లలు( Kids ) లేకపోవడం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

విజయశాంతి దంపతులు పిల్లల్ని వద్దనుకున్నారు అయితే ఎందుకు పిల్లల్ని వద్దనుకున్నారు అనే విషయం గురించి ఈమె మాట్లాడుతూ…తాను ప్రజల కోసమే పిల్లల్ని వద్దనుకున్నట్టు తెలిపారు.ఈ లైఫ్ని ప్రజలకు అంకితం ఇవ్వడం కోసమే పిల్లల్ని కనొద్దు అనుకున్నామని తెలిపారు.ఇక తన ఆస్తి గురించి కూడా ఈమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను మరణించిన తర్వాత నా ఆస్తి మొత్తం ప్రజలకే దక్కేలా చర్యలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు.
తన తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్య, వైద్యం కోసం తన ఆస్తిని కేటాయిస్తానని చెప్పారు.ఇక తన వద్ద ఉన్న నగలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి హుండీలో వేశానని ఈమె తెలిపారు.
ఇలా విజయశాంతి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల పట్ల అభిమానులు పెద్ద ఎత్తున ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.