త్రివిక్రం డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ హ్యాట్రిక్ సినిమా త్వరలో షురూ చేస్తున్నారు.ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం త్రివిక్రం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇదివరకు సినిమాకు 18 నుండి 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ సినిమాకు 25 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు మహేష్ బాబు కూడా 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత త్రివిక్రం సినిమా లైన్ లో ఉంది. త్రివిక్రం సినిమా పూర్తి చేశాక వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తారట.
మహేష్ సినిమాల లైనప్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తుంది.సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ ఫిక్స్ చేశారు.
సినిమాలో మహేష్ మాస్ లుక్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.