సీఎం కేసీఆర్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
అటవీ శాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య నిత్యం చిచ్చు రేగుతూనే ఉందని చెప్పారు.ప్రభుత్వం చేతగాని తనం కారణంగా ఓ అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఇందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు.పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు.