తెలుగులో అమ్మ, అక్క, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “సురేఖ వాణి” గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మొదటగా సురేఖ వాణి తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన “లీలా మహల్ సెంటర్” అనే చిత్రం ద్వారా నటిగా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైంది.
ఆ తర్వాత క్రమక్రమంగా తన నటనా ప్రతిభను నిరూపించుకుని అవకాశాలు దక్కించుకంటూ ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.
అయితే ఈ మధ్య కాలంలో సినిమా షూటింగులు లేకపోవడంతో సురేఖ వాణి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
అలాగే తన కూతురు సుప్రీత తో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీత తో కలిసి తీసుకున్నటువంటి వీడియోలు మరియు ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తోంది.
దీంతో కొందరు నెటిజన్లు “సురేఖ వాణి సంతూర్ మమ్మీ” అంటూ కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మాత్రం “పిల్ల కంటే తల్లే బాగుందంటూ” కొంతమేర బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరైతే ఏకంగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత ను హీరోయిన్ గా ఎప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కానీ ఆ మధ్య కాలంలో సురేఖ వాణి తన కూతురు హీరోయిన్ ని చేసే విషయంపై స్పందిస్తూ సుప్రీతను హీరోయిన్ ని చేయబోనని అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.కానీ సుప్రీత కు మాత్రం సోషల్ మీడియా మాధ్యమాలలో మంచి ఫాలోయింగ్ ఉంది.
అంతేగాక సుప్రీత అప్పుడప్పుడు పలు ఫొటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తోంది.కాగా ఇప్పటివరకూ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 3 లక్షల పైచిలుకు మంది ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు.