బ్యాంక్ సెంటర్ వద్ద నిరసన దీక్ష ప్రారంభించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరును ప్రభుత్వం కుట్ర పూరితంగా మార్చిందంటూ నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు.
రోడ్ పై బైఠాయిస్తే ఇటీవల ట్రాఫిక్ కు అంతరాయమంటూ అరెస్టులు జరిపిన నేపధ్యంలో బ్యాంక్ సెంటర్ లో ఉన్న ఖాజీ గారి స్థలం ఆవరణలో నిరసన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసిన తెలుగు తమ్ముళ్ళు.సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్న నిరసన దీక్ష.
నిరసన దీక్ష శిబిరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కామెంట్స్.ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు ప్రభుత్వం కుట్రపూరితంగా చేసింది.బిల్లు ప్రతులను చింపివేసి నిరసన తెలుపుతున్నాం.నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక రోజు అక్టోబర్ 3 తేదీ వరకు నిరసన దీక్షలు జరుపుతాము.
ఇటువంటి మూర్ఖపు నిర్ణయాలు ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి, ఏం ప్రభుత్వం తీసుకోలేదు.ఈ నిర్ణయం వలన మెడిసిన్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కుంటారు.