పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్ధకం ఒకటి.జీర్ణక్రియ పని తీరు నెమ్మదించడం వల్ల మలబద్ధకం తరచూ ఇబ్బంది పెడుతుంటుంది.
దాంతో ఈ సమస్యను ఇతరులతో పంచుకోలేక.ఎలా నివారించుకోవాలో అర్థంగాక తెగ సతమతమైపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే డిటాక్స్ డ్రింక్ను సేవిస్తే గనుక మలబద్ధకం సమస్య పరార్ అవ్వడమే కాదు.మళ్లీ మళ్లీ రాకుండా ఉంటుంది.
మరి ఆ డిటాక్స్ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఎప్పుడు సేవించాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక యాపిల్ పండు తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేసుకుని రసం తీసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక స్పూన్ అల్లం రసం, రెండు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు నల్ల ఉప్పు మరియు యాపిల్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే డిటాక్స్ డ్రింక్ సిద్ధం అయినట్టే.
ఈ డిటాక్స్ డ్రింక్ను ఉదయం ఖాళీ కడుపుతో సేవించాలి.ఇది తాగిన తర్వాత గంట వరకు మరే ఆహారం తీసుకోరాదు.రెండు రోజులకు ఒక సారి ఈ డిటాక్స్ డ్రింక్ను తీసుకుంటే జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.అదే సమయంలో పెద్ద పేగులో ఉండే వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి.ఫలితంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే పరిగడుపున ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు దూరం అవుతాయి.
శరీరం యాక్టివ్గా మారుతుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ డ్రింక్ను సేవించవచ్చు.
ఈ డిటాక్స్ డ్రింక్లో ఉండే ఫైబర్ మరియు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వేగంగా వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడతాయి.మరియు రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారు అవుతుంది.