వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.దీంతో ఆ టాప్-5 ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.అంతేకాదు ఈ టాప్-5 ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు ఆటగాళ్లు మన భారతీయులే.
వెస్టిండీస్- భారత్ 5వ టీ20 మ్యాచ్ లో( India vs WI ) సూర్య కుమార్ యాదవ్ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ లతో 61 పరుగులు చేశాడు.దీంతో టీ20 క్రికెట్ లో తొలి 50 ఇన్నింగ్స్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.
ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ ఆ తర్వాత బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ:
అంతర్జాతీయ క్రికెట్లో రన్ లీడర్ గా విరాట్ కోహ్లీకి( Virat Kohli ) ప్రత్యేక స్థానం ఉంది.విరాట్ కోహ్లీ తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో మొత్తం 1943 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
బాబర్ ఆజం:
పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం( Babar Azam ) తోలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1942 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
మహమ్మద్ రిజ్వాన్:
పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అయినా మహమ్మద్ రిజ్వాన్( Mohammad Rizwan ) తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1888 పరుగులు చేసి ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.
సూర్య కుమార్ యాదవ్:
భారత జట్టు బ్యాటర్ అయిన సూర్య కుమార్ యాదవ్ తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1841 పరుగులు చేసి తాజాగా ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు.
కేఎల్ రాహుల్:
భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్( KL Rahul ) తొలి 50 టీ20 ఇన్నింగ్స్ లలో 1751 పరుగులతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.