ఓకే వేదికపై రజిని, ధనుష్ లకు అవార్డులు..!

సూపర్ స్టార్ రజినికాంత్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మామా అల్లుళ్లన్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ మామా అల్లుళ్లు ఒకే వేదిక మీద ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోనున్నారు.

 Superstar Rajinikanth And Dhanush Same Stage Sharing Dadasaheb Phalke And Nation-TeluguStop.com

రీసెంట్ గా రజినీకి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ అవార్డు ప్రధానోత్సవంలోనే జాతీయ అవార్డులను ఇవ్వనున్నారట.

ఈమధ్యనే నేషనల్ అవార్డ్ ప్రకటనల్లో అసురన్ సినిమాకు గాను ధనుష్ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలుచుకున్నారు.మే 3న 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.

అయితే ఇదే వేదిక మీద రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరిస్తారని తెలుస్తుంది.ఒకే వేదిక మీద అటు రజినీ, ఇటు ధనుష్ ఇద్దరు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడం రజినీ ఫ్యామిలీకి మరిచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుంది.

వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ రజినీ వరుసగా సినిమాలు చేస్తున్నారు.ధనుష్ కూడా మామకు తగిన అల్లుడిగా తన సత్తా చాటుతున్నాడు.రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తుండగా.ధనుష్ కర్ణన్, జగమే తందిరం సినిమాల్లో నటిస్తున్నారు.2010లో ఆడుకాలం సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్ అసురన్ సినిమాతో రెండోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube