అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) నాలుగు రోజుల పర్యటన కోసం ఇండియాలో అడుగుపెట్టారు.సోమవారం వచ్చేశారు.
ఆయనతో పాటు భారత సంతతికి చెందిన భార్య ఉష, ముగ్గురు పిల్లలు ఇవాన్ (8), వివేక్ (5), మిరాబెల్ (3) కూడా ఉన్నారు.ఈ టూర్లో ఢిల్లీ, జైపూర్, ఆగ్రా వంటి నగరాలను చుట్టేస్తారు.
అధికారిక మీటింగ్లతో పాటు మన కల్చర్ను కూడా చూస్తారు.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో( Indira Gandhi International Airport ) వాన్స్ ఫ్యామిలీకి అదిరిపోయే వెల్కమ్ లభించింది.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్( Minister Ashwini Vaishnav ) స్వయంగా వచ్చి స్వాగతం పలికారు.అయితే, అసలు సిసలు స్పెషల్ అట్రాక్షన్ మాత్రం వాన్స్ పిల్లలే.రంగురంగుల భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయి, సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయారు.ఇవాన్ ఏమో గ్రే కలర్ కుర్తా, తెల్ల పైజామాలో కనిపించాడు.వివేక్ పసుపు రంగు కుర్తాలో భలే చలాకీగా ఉన్నాడు.
ఇక చిన్నారి మిరాబెల్ ( Mirabel )అయితే టీల్ గ్రీన్ అనార్కలీ సూట్, దానికి మ్యాచింగ్ జాకెట్తో భలే ముద్దుగా మెరిసిపోయింది.ఈ ఫోటోలు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
భారతీయ సంస్కృతిని గౌరవించినందుకు నెటిజన్లు వాళ్ల ఫ్యామిలీని మెచ్చుకుంటున్నారు.

వైస్ ప్రెసిడెంట్ వాన్స్ నేవీ బ్లూ సూట్, వైట్ షర్ట్, రెడ్ టైతో ఫార్మల్గా కనిపించారు.ఆయన భార్య ఉష ఎరుపు రంగు పొడవాటి డ్రెస్, దానిపై వైట్ బ్లేజర్తో ఎంతో హుందాగా ఉన్నారు.ఢిల్లీకి చేరుకున్నాక, ఈ ఫ్యామిలీ ప్రముఖ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించింది.ఆలయ అద్భుత నిర్మాణం ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు.వాళ్ల షెడ్యూల్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలున్నాయి.మంగళవారం, ప్రత్యేక విమానంలో జైపూర్ వెళ్తారు.
అక్కడ లగ్జరీ హోటల్ రాంబాగ్ ప్యాలెస్లో బస చేస్తారు.ఉదయం వైస్ ప్రెసిడెంట్ వాన్స్ చారిత్రక అంబర్ కోటను సందర్శిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు, RIC (రీజనల్ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్)లో ప్రసంగిస్తారు.బుధవారం ఉదయాన్నే ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలను చూడటానికి వెళ్తారు.
అదే రోజు తిరిగి జైపూర్ వచ్చి, సిటీ ప్యాలెస్ను సందర్శిస్తారు.ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే అధికారిక విందు కూడా వీరి ఎజెండాలో ఉంది.
గురువారం ఉదయం వాన్స్ కుటుంబం తిరిగి అమెరికాకు పయనమవుతుంది.