భారతదేశాన్ని అనేకమంది రాజులు పరిపాలించారు.ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో రాజు పరిపాలించారు.
కొంతమంది మంచి పాలన అందించి చరిత్రలో నిలిచిపోగా.మరికొంతమంది ప్రజలను హింసించి చెడ్డ పేరు మూటకట్టుకున్నారు.
ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాల్లో అలాంటి రాజు గురించి చదువుకుంటున్నాం.రాజుల ఐకానిక్ కోటలు, రాజభవనాలు స్మారక చిహ్నాలుగా ఇప్పటికీ ఉన్నాయి.
ఇక భారతదేశంలో( India ) ఇలాంటి కోటలు, రాజభవనాలు, నిర్మాణాలు చాలా ఉన్నాయి.
అలాగే శత్రువులు కూడా రాజుల కోటపై మొదట దాడి చేస్తారు.అయితే ఒక కోటపై మాత్రం ఎవరూ దాడి చేయలేకపోయారు.భారతదేశంలోని పశ్చిమ భాగాన్ని కొంకణ్ కరై అని రాజుల కాలంలో పిలిచేవారు. కొంకణ్( Konkan ) తీర ప్రాంతం మూడు శతాబ్ధాలకుపైగా నిలిచిన కోటలతో నిండి ఉంది.14,17వ శతాబ్ధాల మధ్య నిర్మించిన, పశ్చిమ బారతదేశ తీరం వెంబడి ఉన్న కోటలు బీజాపూర్, గొల్కోండ,అహ్మదాబాద్ సుల్తానులు.హైదరాబాద్ నిజాం, విజయనగరం ప్రాంతాలు శక్తివంతమైన సామ్రాజ్యం మధ్య జరిగిన యుద్దాలుగా సాక్ష్యాలుగా ఉన్నాయని చెప్పవచ్చు.
అలాగే మహారాష్ట్రలోని మురుద్ తీర ప్రాంతానికి సమీపంలో గల అరేబియా సముద్రంలో ఒక ద్వీపంలో బంజీరా కోట( Janjira fort ) నిర్మించారు.జాన్సీరా జల్ధుర్గా నిజాం షాహి రాజవంశానికి చెందిన అహ్మద్ నగర్ సుల్తాన్ సేవలో అబ్సినియన్ మంత్రి అయిన మాలిక్ అంబర్ చేత ఇది నిర్మించబడింది.ఈ కోట 22 ఎకరాల్లో ఉంటుంది.
ఈ కోట నిర్మించడానికి 22 సంవత్సరాలు పట్టిందట.కోట అండాకారంలో ఉంటుంది.దాదాపు 40 అడుగుల ఎత్తులో ఉండే ఈ కోట.19 వృత్తాకార కారిడార్లు, తోరణాలను కలిగి ఉంటుంది.వీటిపై ఇప్పటికే ఫిరంగులు అమర్చబడి ఉన్నాయి.ఈ కోటలో మసీదు శిధిలాలు, రాజభవనం ఉన్నాయి.కోట చుట్టూ సముద్రం ఉండటం వల్ల పడవలో మాత్రమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది.ఈ కోటను ఏ రాజు జయించలేకపోయాడు.