తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) మాట్లాడిన భాషపై చర్చిద్దామా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్సే తప్పు చేసినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ కు( BRS ) బుద్ధి రాలేదని మండిపడ్డారు.
సీఎంను అగౌరవపరిచేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చకు రాకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమైనే నాయకుడిని సభకు తీసుకురావాలని బీఆర్ఎస్ సభ్యులకు సూచించారు.సానుభూతి కోసం వీల్ చైర్ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.ప్రతిపక్ష నేత చర్చకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా కాళేశ్వరంపై( Kaleshwaram ) చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.