ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై రాజకీయ రగడ రాజుకుంది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( YCP leader YV Subbareddy ) వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతుంది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.పదేళ్ల తరువాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని పేర్కొన్నారు.
ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదన్నారు.వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు.
కేంద్రంతో సత్సంబంధాలు ఏ రాష్ట్రానికి అయినా అవసరమేనని బొత్స వెల్లడించారు.







